రాజీవ్ యువ ఖేల్ క్రికెట్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ ఖేల్ క్రికె ట్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ల్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్, జాగృతి జట్లు గెలుపొందాయి. మొదటి మ్యాచ్లో సికింద్రాబాద్ పీజీ కాలేజి 2 పరుగుల తేడాతో జీసీపీఈ జట్టుపై గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు చేసింది.
సాయి కుమార్ (40) రాణించాడు. జీసీపీఈ బౌలర్లలో ముజ్జు 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం జీసీపీఈ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 78 పరుగులు చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్లో జాగృతి జట్టు 4 వికెట్ల తేడాతో కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేజీ రెడ్డి జట్టు 10 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌటైంది. జాగృతి బౌలర్లలో మను, చందు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం జాగృతి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులు చేసి గెలిచింది. కేజీ రెడ్డి బౌలర్లలో యశ్వంత్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.