-

క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్

16 Aug, 2013 16:33 IST|Sakshi
క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్

వాషింగ్టన్: సిన్సినాటి మాస్టర్స్‌లో టోర్నీలో అమెరికాకు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరీనా విలియమ్స్  జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ రోజు జరిగిన ప్రి-క్వార్టర్స్‌లో సెరీనా విలియమ్స్ 6-4, 6-1 తేడాతో మోనా బర్తెల్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.  సెరీనా ధాటికి ఏ మాత్రం పోటీ నివ్వకుండానే ప్రత్యర్థి క్రీడా కారిణి మోనా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.  ఆద్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరీనా విజయం సాధించి తన బ్యాట్ కు పదును తగ్గలేదని రుజువు చేసింది.  

 

శుక్రవారం జరిగే క్వార్టర్స్ ఫైనల్లో సెరీనా విలియమ్స్ రోమానియన్ సిమోనాతో తలపడనుంది.
 

మరిన్ని వార్తలు