పాక్‌దే సిరీస్

10 May, 2015 01:33 IST|Sakshi

రెండో టెస్టులో బంగ్లాపై విజయం
 మిర్పూర్ : లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (4/73) సుడులు తిరిగే బంతులకు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. ఫలితంగా షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో పాక్ 328 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. తద్వారా రెండు టెస్టుల ఈ సిరీస్‌ను పాకిస్తాన్ 1-0తో గెలుచుకుంది. సిరీస్‌లో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ పర్యటనలో పాక్‌కు ఇదే తొలి విజయం. 550 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆట నాలుగో రోజు శనివారం 56.5 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

సూపర్ ఫామ్‌లో ఉన్న మోమినుల్ హక్ (68; 9 ఫోర్లు), తమీమ్ (42; 7 ఫోర్లు) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా 11 టెస్టుల్లో 50 అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన రిచర్డ్స్, సెహ్వాగ్, గంభీర్ సరసన మోమినుల్ నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ పురస్కారం అజహర్ అలీకి దక్కింది.

మరిన్ని వార్తలు