-

ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌కు షకిబుల్‌

15 Mar, 2018 15:06 IST|Sakshi

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగే ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకిబుల్‌ హసన్‌ అందుబాటులోకి వచ్చాడు. ఇటీవల ఢాకాలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో గాయపడిన షకిబుల్‌.. ట్వంటీ 20 ట్రై సిరీస్‌ నాటికి అందుబాటులోకి వస్తాడని తొలుత  భావించారు. కానీ అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో షకిబుల్‌కు మరికొన్ని రోజులు ఇచ్చారు.

కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో లంకేయులతో అమీతుమీ తేల్చుకోవాల్సిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో షకిబుల్‌ను జట్టులో చేర్చుతూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. దాంతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ తుది జట్టులో షకిబుల్‌ స్థానం దాదాపు ఖాయం. రేపు(శుక్రవారం) శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. బుధవారం బంగ్లాదేశ్‌ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు