మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేసిన షమీ

2 Mar, 2019 16:19 IST|Sakshi

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 173 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(40) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. ఆ తర్వాత ఖవాజా-స్టోయినిస్‌ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది.

వీరిద‍్దరూ 87 పరుగులు జత చేసిన తర్వాత స్టోయినిస్‌(37) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.ఆపై కాసేపటికి హాఫ్‌ సెంచరీ సాధించిన ఖావాజా సైతం పెవిలియన్ బాట పట్టాడు.కాగా, హ్యాండ్స్‌ కాంబ్‌-మ్యాక్స్‌వెల్‌ జంట 36 పరుగులు జోడించింది. నాల్గో వికెట్‌గా హ్యాండ్స్‌ కోంబ్‌(19) ఔట్‌ కాగా, ఐదో వికెట్‌గా టర్నర్‌(21) పెవిలియన్‌ చేరాడు. ఇక కుదరుగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌ను షమీ బోల్తా కొట్టించాడు. టర్నర్‌, మ్యాక్స్‌వెల్‌లు షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యారు. ఆసీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, కేదర్‌ జాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు