ఫైనల్లో షణ్ముఖ అంజన్

10 Feb, 2014 00:22 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ అండర్-13 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సాయి షణ్ముఖ అంజన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కడపలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ అంజన్ 21-16, 21-9తో మన రాష్ట్రానికే చెందిన రితిన్‌పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ మైస్నమ్ మియరబా (మణిపూర్) 21-12, 21-12తో మూడో సీడ్ వరుణ్ దేవ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు.

మరో వైపు బాలికల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో వైష్ణవి రెడ్డి- పుల్లెల గాయత్రి జోడి 17-21, 21-16, 22-24తో రిచా ముక్తిబోద్ (కర్ణాటక) -సిమ్రాన్ (మహారాష్ట్ర) జోడి చేతిలో ఓటమి చవిచూసింది. మరో సెమీఫైనల్లో దీత్య జగదీశ్- మేధ శశిధరణ్ (కర్ణాటక) జోడి 23-21, 21-13తో జోషి దివ్యాన్షి-షిఫాలి గౌతమ్ (ఉత్తరప్రదేశ్) జోడిపై నెగ్గింది.

 ఇతర ఫలితాలు:  అండర్-15 బాలుర విభాగం: లక్ష్యసేన్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై, రాహుల్ భరద్వాజ్(కర్ణాటక) 13-21, 21-11, 21-16తో ఓరిజిత్ చాలిహపై గెలిచారు.
 
 బాలికల విభాగం: పూర్వ బార్వె (మహారాష్ట్ర) 21-16, 22-20తో పూజ దేవ్లేకర్ (మహారాష్ట్ర)పై, అశ్విన్ భట్ (కర్ణాటక) 21-18, 21-19తో రియా ఆరోల్కర్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు.  బాలికల డబుల్స్: అశ్విన్ భట్-మిథుల జంట (కర్ణాటక ) 21-19, 23-21తో రియా అరోల్కర్-పూర్వ బార్వె (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది.
 

మరిన్ని వార్తలు