గాయంతో శిఖర్ ధావన్ అవుట్

18 Aug, 2015 02:04 IST|Sakshi
గాయంతో శిఖర్ ధావన్ అవుట్

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా శ్రీలంకతో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. తొలి టెస్టు సమయంలో ధావన్ కుడి చేతికి గాయమైంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ గాయం నుంచి కోలుకుంటున్నాడని, మ్యాచ్ ముందు రోజే అతను ఆడేదీ లేనిదీ తెలుస్తుందని భారత జట్టు తెలిపింది. ఒకవేళ విజయ్ కూడా కోలుకోకపోతే పుజారా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు