ముందంజలో శివ నాగరాజు

25 Jan, 2014 00:05 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ 0-7 కేటగిరీలో శివ నాగరాజు ముందంజలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ గోల్ఫ్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్, కంట్రీ క్లబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శివ నాగరాజు 74 గ్రాస్ స్కోర్‌తో ముందంజలో కొనసాగుతున్నాడు. నరేష్ (76) రెండో స్థానంలో, హరిధర్ రెడ్డి (78) మూడో స్థానంలో ఉన్నారు. 8-12 కేటగిరీలో సంతోష్ 69 నెట్ స్కోరుతో ఆధిక్యంలో నిలిచాడు.
 
 అయితే తనతో పాటు అశోక్ రెడ్డి (69) సమాన స్కోరుతో రెండో స్థానంలో ఉండగా, ప్రవీణ్ (70) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 13-18 కేటగిరీలో అగ్రస్థానంలో  ఉమేష్ గుప్తా(60), మనోజ్ (63), హుస్సేన్ (65) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే 0-7 కేటగిరీలో 10 మంది, 0-8, 13-18 కేటగిరీల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు.
 

మరిన్ని వార్తలు