క్వార్టర్స్‌లో శివాని, రష్మిక

18 Jan, 2018 10:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌–2018 గ్రేడ్‌–2 టోర్నమెంట్‌లో తెలుగమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో శివాని అమినేని 6–4, 7–5తో కావ్య (భారత్‌)పై విజయం సాధించగా... శ్రీవల్లి రష్మిక 7–6 (7/1), 6–3తో పూజ ఇంగాలే (భారత్‌)పై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.   

మరిన్ని వార్తలు