'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

9 Jan, 2015 17:21 IST|Sakshi
'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

దుబాయ్: వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగకు చోటు కల్పించకపోవడంపై స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉపుల్ తరంగకు ఉద్వాసన పలికి యువ ఆల్ రౌండర్ జీవన్ మెండిస్ కు చోటు కల్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని మురళీధరన్ పేర్కొన్నాడు.

తరంగకు వన్డేల్లో మంచి రికార్డు ఉందని, అతడి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నాడు. అయితే తరంగను కాదని జీవన్ ను ఎంపిక చేయడం సబబుగా లేదని అభిప్రాయపడ్డాడు. ఐదు ప్రపంచకప్ లు ఆడిన మురళీధరన్ 67 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు