షూటర్‌ రష్మీ రాథోడ్‌కు నిరాశ

15 Apr, 2019 15:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ షూటర్‌ రష్మీ రాథోడ్‌కు నిరాశ ఎదురైంది.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో రష్మీ రాథోడ్‌ 109 పాయింట్లు సాధించి 45వ స్థానంతో సరిపెట్టుకుంది.

భారత్‌కే చెందిన మహేశ్వరి చౌహాన్‌ 114 పాయింట్లతో 21వ స్థానంలో... గనీమత్‌ షెఖాన్‌ 108 పాయింట్లతో 48వ స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు