సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ షూటర్ రష్మీ రాథోడ్కు నిరాశ ఎదురైంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ రాథోడ్ 109 పాయింట్లు సాధించి 45వ స్థానంతో సరిపెట్టుకుంది.
భారత్కే చెందిన మహేశ్వరి చౌహాన్ 114 పాయింట్లతో 21వ స్థానంలో... గనీమత్ షెఖాన్ 108 పాయింట్లతో 48వ స్థానంలో నిలిచారు.