కైనన్, గగన్, రష్మీలకు చోటు

31 Jan, 2017 00:23 IST|Sakshi

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీకి భారత జట్టు ఎంపిక

న్యూఢిల్లీ: తొలిసారి భారత్‌ ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలే పుణేలో జరిగిన జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పోటీలతోపాటు రెండు సెలెక్షన్‌ టోర్నీలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ జట్టు ఎంపిక జరిగింది.

రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తెలంగాణ షూటర్లు గగన్‌ నారంగ్‌ (రైఫిల్‌ ప్రోన్‌), కైనన్‌ షెనాయ్‌ (ట్రాప్‌)లతోపాటు మహిళల స్కీట్‌ ఈవెంట్‌లో జాతీయ చాంపియన్‌ రష్మీ రాథోడ్‌లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది.  

 

మరిన్ని వార్తలు