ట్రినిడాడ్: వెస్టిండీస్తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీలతో అదరగొట్టగా, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ రెండు వన్డేల్లోనూ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి అర్థ శతకాలతో రాణించాడు. ప్రధానంగా చెప్పుకోవాలంటే రెండు, మూడు వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్లో కోహ్లి, అయ్యర్ల ఆటే వార్తల్లో నిలిచిందంటే అతిశయోక్తి కాదు.( ఇక్కడ చదవండి: విండీస్పై భారత్ విజయం)
మూడో వన్డేలో కూడా అయ్యర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంతో కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ‘ అయ్యర్ ఆట అసాధారణం. ఒత్తిడిలో పడ్డ సమయంలో అయ్యర్ ఎంతో సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. నాపై ఉన్న ఒత్తిడిన మొత్తం అయ్యర్ తగ్గించేశాడు. గేమ్ మావైపుకి వచ్చిందంటే అయ్యర్ నిలకడైన ఆటే కారణం. మ్యాచ్ను కంట్రోల్కి తీసుకుని ఆడిన తీరు అద్భుతం’ అని కోహ్లి కొనియాడాడు. మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించిన తర్వాత ఒకింత ఆందోళనకు గురైనట్లు కోహ్లి పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: కోహ్లి తిరుగులేని రికార్డు!