న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మూడు టెస్టుల సిరీస్కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ మేరకు గురువారం 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. ఇందులో కేఎల్ రాహుల్ను తప్పిస్తూ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. వెస్టిండీస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన రాహుల్ను తప్పించాలని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టేశారు. అదే సమయంలో రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దాంతో మయాంక్ అగర్వాల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ ఇన్నింగ్స్ను పంచుకోనున్నాడు. ఇక శుబ్మన్ గిల్కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది.
మరొకవైపు సఫారీలతో మూడు టీ20ల సిరీస్లో ఎంపిక కాని కుల్దీప్ యాదవ్ను టెస్టుల్లో తీసుకున్నారు. కాగా, యజ్వేంద్ర చహల్కు మాత్రం చోటు కల్పించలేదు. వికెట్ కీపర్లలో రిషభ్ పంత్తో పాటు వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేశారు. వెస్టిండీస్ పర్యటనలో సాహా ఉన్నప్పటికీ అతనికి ఆడే అవకాశం రాలేదు. దాంతో సఫారీలతో జరుగనున్న టెస్టు సిరీస్లో సాహాను ఎక్కువగా పరీక్షించే అవకాశం ఉంది.
భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుబ్మన్ గిల్