శిఖర్, రహానేలు హాఫ్ సెంచరీలు

25 Oct, 2015 19:37 IST|Sakshi

ముంబై:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు హాఫ్ సెంచరీలతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. శిఖర్(58), రహానే(51)  క్రీజ్ లో ఉన్నారు.

 

దక్షిణాఫ్రికా విసిరిన 439 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 44 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడ్డ టీమిండియా ఇన్నింగ్స్ కు శిఖర్, రహానేలు మరమ్మత్తులు చేపట్టారు. అంతకుముందు రోహిత్ శర్మ(16), కోహ్లి(7) పెవిలియన్ కు చేరారు. టీమిండియా 22 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 151 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.

మరిన్ని వార్తలు