తుది పోరుకు సిక్కి-అశ్విని ద్వయం

12 Dec, 2016 15:01 IST|Sakshi
తుది పోరుకు సిక్కి-అశ్విని ద్వయం

న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-16, 21-18తో సోఫీ బ్రౌన్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జంటపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ చోప్రా జంట 16-21, 14-21తో గో సూన్ హువాట్-షెవోన్ జెమీ లాయ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది.

మరిన్ని వార్తలు