ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్

13 Dec, 2016 01:52 IST|Sakshi
ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్

దుబాయ్‌: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్, రన్నరప్‌ పీవీ సింధు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఈనెల 14 నుంచి దుబాయ్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌ ‘డ్రా’ వివరాలను వెల్లడించారు. గ్రూప్‌ ‘బి’లో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ మారిన్ (స్పెయిన్), సింధు (భారత్‌), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా)లకు చోటు కల్పించారు. గ్రూప్‌ ‘ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), సుంగ్‌ జీ హున్ (కొరియా), ఇంతనోన్ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), హీ బింగ్‌జియావో (చైనా) ఉన్నారు. లీగ్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.

మరిన్ని వార్తలు