క్వార్టర్ ఫైనల్లో సింధు

16 Oct, 2015 19:30 IST|Sakshi
క్వార్టర్ ఫైనల్లో సింధు

ఓడోన్సీ(డెన్మార్క్): భారత స్టార్ షట్లర్, వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్  డెన్మార్క్ ఓపెన్ లో  తన పోరాటాన్ని ముగించినా.. మరో  హైదరాబాదీ అమ్మాయి పివి సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరింది.  మహిళల ప్రి క్వార్టర్ ఫైనల్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో సింధు 21-12, 21-15 తేడాతో మూడో సీడ్ తై జూ యింగ్(చైనీస్ తైపీ)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.

 

గతంలో మూడు సార్లు జూ యింగ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న సింధు డెన్మార్క్ ఓపెన్ లో అందుకు ప్రతీకారం తీర్చుకుంది. వరుస సెట్లను కైవసం చేసుకుని జూ యింగ్ పై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. సింధు తన తదుపరి పోరులో ఆరో సీడ్ వాంగ్ యహాన్(చైనా)తో తలపడనుంది.

మరిన్ని వార్తలు