పెర్త్: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ స్టీవ్ స్మిత్, జార్జ్ బెయిలీలు హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. 60 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో బెయిలీ హాఫ్ సెంచరీ చేయగా, స్మిత్ 55 బంతుల్లో 2 ఫోర్లతో అర్థ సెంచరీ చేశాడు. దీంతో ఆసీస్ 25. 0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆరోన్ ఫించ్(8), డేవిడ్ వార్నర్(5) పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టీమిండియా బౌలర్లలో బరిందర్ శ్రావణ్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 309 పరుగుల చేసింది.