సొహైల్‌కు రజతం

6 Dec, 2018 10:14 IST|Sakshi

జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: భారత పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో హైదరాబాద్‌ కుర్రాడు మొహమ్మద్‌ సొహైల్‌ ఆకట్టుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ టోర్నీ అండర్‌–17 బాలుర 75–80 వెయిట్‌ కేటగిరీలో సొహైల్‌ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌లో సొహైల్‌ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. పెద్దపల్లి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ మొహమ్మద్‌ సొహైల్‌ రాణించాడు.  

మరిన్ని వార్తలు