తొలి రౌండ్‌లో సౌజన్య ఓటమి

31 Jan, 2019 10:06 IST|Sakshi

ఐటీఎఫ్‌ మహిళల టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారుల పోరాటం తొలిరౌండ్‌లోనే ముగిసింది. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో సౌజన్య భవిశెట్టి, సాయి సంహిత చామర్తి మొదటి రౌండ్‌లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య 5–7, 3–6తో పైజె హైరియాన్‌ (న్యూజిలాండ్‌) చేతిలో, సాయి సంహిత 4–6, 1–6తో మూడో సీడ్‌ వలేరియా స్ట్రాకోవా (ఉక్రెయిన్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇతర మ్యాచ్‌ల్లో వైదేహి చౌదరి (భారత్‌) 3–6, 3–6తో మిహేలా జకోవిచ్‌ (సెర్బియా) చేతిలో, మహెక్‌ జైన్‌ (భారత్‌) 4–6, 4–6తో ఫత్మా నభాని (ఒమన్‌) చేతిలో ఓడటంతో ఈ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మరోవైపు డబుల్స్‌ విభాగంలోనూ తెలంగాణ క్రీడాకారులకు కలిసి రాలేదు. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సామ సాత్విక–సాయి సంహిత (భారత్‌) ద్వయం 2–6, 3–6తో సోఫియా షపటవా (జార్జియా)–ఎమిలీ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయి తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది. 

మరిన్ని వార్తలు