ఫైనల్లో సౌరభ్ వర్మ

18 Sep, 2016 01:56 IST|Sakshi
ఫైనల్లో సౌరభ్ వర్మ

న్యూఢిల్లీ: బెల్జియం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బెల్జియంలోని లెవెన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-16తో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో లుకాస్ కార్వీ (ఫ్రాన్స్)తో సౌరభ్ ఆడతాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర ఆటగాళ్లు చిట్టబోరుున రాహుల్ యాదవ్ రెండో రౌండ్‌లో, ఆనంద్ పవార్ తొలి రౌండ్‌లో ఓడిపోయారు.

>
మరిన్ని వార్తలు