గాలె: శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆతిథ్య బౌలర్ల ధాటికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 126 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డు ప్లెసిస్ (49; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రత్యర్థి బౌలర్లలో దిల్రువాన్ పెరీరా 4, లక్మల్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక శుక్రవారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కరుణరత్నే (60; 7 ఫోర్లు) రాణించాడు.
ప్రస్తుతం మాథ్యూస్ (14 బ్యాటింగ్), సిల్వా (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్న లంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 161తో కలుపుకొని 272 పరుగుల ముందు ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 4/1 తో తొలిఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టు... లంక బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకే ఆలౌటైంది.