పోర్ట్ ఎలిజబెత్: జింబాబ్వేతో నాలుగు రోజుల తొలి ప్రయోగాత్మక టెస్టులో మొదటి రోజే దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 78.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 309 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఓపెనర్ ఐడెన్ కైల్ మర్క్రమ్ (125; 14 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించడం విశేషం. డివిలియర్స్ (53; 5 ఫోర్లు, ఒక సిక్స్), బవూమా (44; 5 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో జార్విస్, ఎంపోఫు మూడేసి వికెట్లు తీసుకోగా... క్రెమెర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఒకదశలో 4 వికెట్లకు 272 పరుగులతో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా చివరి ఐదు వికెట్లను 46 పరుగుల తేడాలో కోల్పోయింది. రెగ్యులర్ కెప్టెన్ డు ప్లెసిస్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కావడంతో డివిలియర్స్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. కడపటి వార్తలు అందే సమయానికి జింబాబ్వే ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.