జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి ఒకే రోజులో 16 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు మూడో టెస్టులోనూ దారుణంగా ఓడింది. ఇన్నింగ్స్, 118 పరుగుల ఆధిక్యంతో నెగ్గిన దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది.
ఈనెల 20 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ జరుగుతుంది. 295 పరుగులు వెనకబడి ఫాలోఆన్ ఆడిన లంక రెండో ఇన్నింగ్స్లో 177 పరుగులకే కుప్పకూలింది. పార్నల్ (4/51), ఒలివియర్ (3/38) లంకను దెబ్బతీశారు.