దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌

8 May, 2020 13:00 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా ఫస్ట్​క్లాస్ క్రికెటర్ సోలో నిక్వెనీ కరోనా వైరస్​కు గురయ్యాడు. ఇప్పటికే 'గులైన్​ బారే సిండ్రోమ్(జీబీఎస్‌)‌' అనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా కొద్ది రోజలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడంతో నిక్వెనీ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్​గా సోలో నిలిచాడు. ఇంతకు ముందు పాక్​ క్రికెటర్​ జాఫర్​ సర్ఫరాజ్​, స్కాట్​లాండ్​కు చెందిన మజిద్ హక్​ కరోనాకు గురయ్యారు.(కరోనాతో మాజీ క్రికెటర్‌ మృతి)

'గతేడాది నాకు జీబీఎస్​కు వచ్చింది. పది నెలలుగా ఈ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. టీబీ వచ్చింది, మూత్రపిండాలు, కాలేయం పాడయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్​గా తేలింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు'అంటూ నిక్వెనీ ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది జీబీఎస్‌కు సంబంధించి చికిత్స పొందుతున్న సమయంలో కొన్ని వారాలు పాటు కోమాలో ఉన్నాడు. నిక్వెనీ 2012లో దక్షిణాఫ్రికా అండర్‌-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా నిక్వెనీ గతంలో ఈస్ట్రెన్‌ ప్రావిన్స్‌, వారియర్స్‌ ప్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం నిక్వెనీ అడేర్​బీర్​ షైర్ క్లబ్​ తరఫున ఆడుతున్నాడు.
(ఐపీఎల్‌లో ఆ పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తలపించేలా)
 

>
మరిన్ని వార్తలు