కాచిగూడ: తెలంగాణ స్టేట్ స్కూల్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేదీ 8వ సౌత్ ఇండియా ఓపెన్ కరాటే అండ్ కుంగ్ ఫూ నేషనల్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించునున్నారు. మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాలలో పోటీలు జరగనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.చెన్నయ్య తెలిపాడు. కరాటే అండ్ కుంగ్ఫూ చాంపియన్ షిప్ పోటీలకు సంబందించిన పోస్టర్ను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కరాటే పోటీలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ టిఎస్ చైర్మన్ రాపోలు సుదర్శన్, ప్రధానకార్యదర్శి బి.విశ్వనాథంలు తదితరులు పాల్గొన్నారు.