దక్షిణ కొరియా గెలుపు

19 Jun, 2018 10:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ కొరియా, తెలంగాణ జట్ల మధ్య జరుగుతోన్న ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్‌లో దక్షిణ కొరియా మహిళల జట్టు దూసుకెళ్తోంది. బాచుపల్లిలోని కాసాని, జేఎస్‌ గెహ్లాట్‌ కబడ్డీ అకాడమీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణకొరియా 34–23తో తెలంగాణపై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం. కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్, టెక్నికల్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ రావు ప్రత్యక్షంగా వీక్షించారు.

మరిన్ని వార్తలు