'సరితాదేవిపై నిషేధం తొలగించాలి'

3 Dec, 2014 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ: నిషేధానికి గురైన మహిళా బాక్సర్ సరితాదేవికి కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. సరితాదేవిపై నిషేధం తొలగించాలని కేంద్ర క్రీడల శాఖ కోరింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్యకు ఈ మేరకు లేఖ రాసింది.

ఆసియా క్రీడల్లో తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ సరితాదేవి పతకం తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యల కింద బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది.

>
మరిన్ని వార్తలు