నేటి క్రీడా విశేషాలు

31 Jul, 2019 13:00 IST|Sakshi

దేశ రక్షణలో భాగం కావాలని రెండు నెలలు ఆటకు విరామం పలికిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని బుధవారం విధుల్లో చేరాడు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆగస్ట్‌ 15 వరకు కశ్మీర్‌ లోయలో సేవలందించనున్నాడు. ముంబై యువ క్రికెటర్, భారత టెస్టు ఓపెనర్‌ పృథ్వీ షా డోపింగ్‌ టెస్టులో దొరికిపోయాడు. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించింది.

మరిన్ని వార్తలు