యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్

27 Aug, 2014 00:23 IST|Sakshi
యువరాజ్ సింగ్xఉసేన్ బోల్ట్

తొలిసారిగా భారత్‌కు స్ప్రింట్ కింగ్
 
బెంగళూరు: పరుగులో ‘చిరుత’ ఉసేన్ బోల్ట్ తొలి సారిగా భారత్ వస్తున్నాడు. అయితే ఈ జమైకా స్టార్ వచ్చేది అథ్లెటిక్స్‌లో పాల్గొనేందుకు కాదు. తనకు ఇష్టమైన క్రికెట్‌లో యువరాజ్‌కు సవాల్ విసిరేందుకు వస్తున్నాడు. ప్యూమా అనే కంపెనీకి ఈ ఇద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు సెప్టెంబర్ 2న చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఆడబోతున్నారు. ‘బోల్ట్ అండ్ యువీ-బ్యాటిల్ ఆఫ్ ద లెజెండ్స్’ పేరుతో వీరి మధ్య పోటీని నిర్వహించనున్నారు. బౌలర్‌గా ఐపీఎల్‌లో బరిలోకి దిగాలని ఉందని గతంలో మనసులో మాటను బయటపెట్టిన బోల్ట్... యువరాజ్‌తో పోటీపడటం ద్వారా తన క్రికెట్ కోరికను మరో రకంగా నెరవేర్చుకోబోతున్నాడు.

>
మరిన్ని వార్తలు