‘ఖేల్‌రత్న’కు హిమదాస్‌

16 Jun, 2020 04:12 IST|Sakshi
హిమదాస్‌

న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్‌ హిమదాస్‌ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్‌ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400మీ.ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం,  మిక్స్‌డ్‌ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రోయర్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లర్‌), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్‌ (హాకీ), రోహిత్‌ శర్మ (క్రికెట్‌)లతో పోటీపడనుంది.  

మరిన్ని వార్తలు