న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన మూడు టి20ల సిరీస్లో భారత్ ప్రత్యర్థి మారింది. ముందుగా అనుకున్న ప్రకారం జింబాబ్వే మన దేశ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ, క్రికెట్ పాలనలో ప్రభుత్వ జోక్యం ఎక్కువవడంతో జింబాబ్వే బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జూలైలో సస్పెండ్ చేసింది.
దీంతో ఆ దేశం స్థానంలో శ్రీలంక భారత్కు రానుంది. సిరీస్లో భాగంగా జనవరి 5న గువాహటిలో, 7న ఇండోర్లో, 10న పుణేలో మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. ‘జింబాబ్వేపై ఐసీసీ వేటుతో శ్రీలంకను ఆహా్వనించాం. వారి బోర్డు అంగీకరించడంతో సిరీస్ ఖరారైంది’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది.