మరో యువ కెరటం అరంగేట్రం..

13 Dec, 2017 11:26 IST|Sakshi

భారత్‌కు కలిసిరాని టాస్‌..

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరోసారి రోహిత్‌కు టాస్‌ కలిసిరాలేదు. టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై మంచు ప్రభావం కారణంగా టాస్‌ కీలకంగా మారిన దశలో రోహిత్‌ టాస్‌ కోల్పోయాడు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా శ్రీలంక బరిలోకి దిగుతుండగా..  భారత్‌ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుంధర్‌ను తీసుకున్నారు..

తొలి మ్యాచ్‌తో శ్రేయస్‌ అయ్యర్‌ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయగా.. ఈ మ్యాచ్‌తో  18 ఏళ్ల వాషింగ్టన్‌ సుంధర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.  అయితే రహానేను తీసుకుంటారని అందరు భావించగా మరో సారి అతనికి మొండిచేయ్యే ఎదురైంది.

వాషింగ్టన్‌ సుంధర్‌ మ్యాచ్‌కు ముందు కోచ్‌ రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు. భారత్‌ తరఫున వన్డే ఫార్మాట్‌లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా సుంధర్‌ గుర్తింపు పొందాడు. తొలుత టీ20లకే సెలక్ట్‌ అయిన ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఆలౌరౌండర్‌ కేదార్‌ జాదవ్‌ గాయంతో జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 

ఇక భారత్‌కు ఈ మ్యాచ్‌ చావోరేవో అన్నట్లుగా మారింది. ఇది గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి మ్యాచ్‌ విజయంతో లంకేయులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ విజయాన్నందుకోవాలని ఉవ్విలూరుతున్నారు.

జట్లు
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, వాషింగ్టన్‌ సుంధర్‌, బుమ్రా, చహల్‌.

శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), గుణతిలక, తరంగా, తిరిమన్నే, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్‌.  

మరిన్ని వార్తలు