పీబీఎల్‌కు శ్రీకాంత్‌ దూరం

26 Nov, 2019 03:54 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో పాల్గొనడం లేదని భారత స్టార్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ ప్రకటించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌పై, ఇతర అంతర్జాతీయ టోర్నీల మీద మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు