గాలె: భారత్ తో తొలిటెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభమైంది.
కెప్టెన్గా కోహ్లి తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఆటగాళ్ల ఫామ్, ఓవరాల్గా జట్టు ప్రదర్శన చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది. అయితే సొంతగడ్డపై బలమైన జట్టయిన లంక తమ దిగ్గజం సంగక్కర వీడ్కోలు సిరీస్ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది.
జట్లు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, ఇషాంత్, ఉమేశ్, మిశ్రా.
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కౌశల్, కరుణరత్నే, సంగక్కర, తరంగ, చండీమల్, ముబారక్, దమ్మిక ప్రసాద్, తరిందు, హెరాత్, ప్రదీప్.