శ్రీలంకదే వన్డే సిరీస్

14 Dec, 2014 00:44 IST|Sakshi
శ్రీలంకదే వన్డే సిరీస్

పల్లెకెలె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆరో వన్డేలో శ్రీలంక 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది.

సం గక్కర (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... దిల్షాన్ (68) రాణించాడు. ఇంగ్లండ్ 41.3 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రూట్ (55), వోక్స్ (41) మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు, సేనానాయకే మూడు వికెట్లు తీశారు.
 

>
మరిన్ని వార్తలు