ఐదు ఓవర్లలో శ్రీలంక స్కోరు 18/0

26 Feb, 2015 09:30 IST|Sakshi

మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ లోభాగంగా ఇక్కడ గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. ఓపెనర్లు తిరుమన్నే(11), దిల్షాన్(4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. బంగ్లా దేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు.

 

గ్రూప్-ఏలో లో తలపడుతున్న ఇరుజట్లు చెరో ఒక మ్యాచ్ ను గెలవడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. అయితే పాయింట్ల పట్టికలో  బంగ్లా కంటే శ్రీలంక వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ను గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడానికి శ్రీలంక చూస్తుండగా, మరోసారి ఆకట్టుకోవడానికి బంగ్లా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు