ఎన్ శ్రీనివాసన్ 15వసారి..

25 Jun, 2016 15:34 IST|Sakshi
ఎన్ శ్రీనివాసన్ 15వసారి..

చెన్నై:  తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   శనివారం జరిగిన టీఎన్సీఏ ఏజీఏం (వార్షిక సర్వసభ్య సమావేశం)లో శ్రీనివాసన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవికి శ్రీనివాసన్ ఒక్కడే  పోటీలో నిలవడంతో ఆయన  ఎన్నిక లాంఛనమైంది.

 

తద్వారా వరుసగా 15వ సారి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కు శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 2016-17 సంవత్సరానికి కార్యనిర్వాహక కమిటీ ఆఫీస్ బేరర్స్ కూడా ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు