క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక

1 May, 2015 04:02 IST|Sakshi
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక

సాక్షి, హైదరాబాద్ : తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక ‘ఐటా’ జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సత్తాచాటుతోంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ జూనియర్ టెన్నిస్ టోర్నీలో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన అండర్-14 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 5-4 (5/2), 4-2తో మేఘారాయ్‌పై విజయం సాధించింది. బాలుర అండర్-16 సింగిల్స్ విభాగంలో తెలంగాణ కుర్రాడు శ్రీవత్స రాచకొండ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో రిత్విక్ చౌదరి (తెలంగాణ) 4-1, 4-1తో కుషాన్ షాపై గెలుపొందగా, అండర్-16 విభాగంలో శ్రీవత్స రాచకొండ 4-1, 4-1తో అతర్వ శర్మపై, ఎ.కె.రోహిత్ (తెలంగాణ) 2-4, 5-4, 4-2తో డానిష్ అహ్మద్‌పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు