శ్రీవల్లి రష్మిక ఓటమి

11 Nov, 2017 10:47 IST|Sakshi

ఐటీఎఫ్‌ జూనియర్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మా యి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. దుబాయ్‌లోని ఏవియేషన్‌ క్లబ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీస్‌లో ఓట మి పాలైంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో రష్మిక 6–1, 2–6, 2–6తో హనియా అబుల్సాద్‌ (ఈజిప్ట్‌) చేతిలో పరాజయం చవిచూసింది.

మరిన్ని వార్తలు