పసిడి పట్టిన జీతూ

1 Mar, 2017 14:05 IST|Sakshi
ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్లు గగనమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రెండు రోజుల కిందట హీనా సిద్దూ, జీతూ రాయ్‌లు మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. తాజాగా బుధవారం 50 మీటర్ల విభాగంలో జీతూరాయ్‌ పసిడికి గురి పెట్టాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్‌ అమన్‌ప్రీత్‌ సింగ్‌ సిల్వర్‌ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
మరిన్ని వార్తలు