నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్

28 Mar, 2017 13:29 IST|Sakshi
నన్ను క్షమించండి: ఆస్ట్రేలియా కెప్టెన్

ధర్మశాల: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ సందర్భంగా నోరు పారేసుకుని, అనుచితంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. సిరీస్ ఓటమి సందర్భంగా దిగొచ్చాడు. తాను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, తనను క్షమించాల్సిందిగా స్మిత్ కోరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది.

ధర్మశాలలో కీలక నాలుగో టెస్టులో భారత్‌ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ మాట్లాడుతూ.. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని చెప్పాడు. ఈ సిరీస్ భారత క్రికెటర్లు, ముఖ్యంగా బౌలర్లు బాగా రాణించారని స్మిత్ ప్రశంసించాడు.

ధర్మశాల టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్ మురళీ విజయ్‌ను స్మిత్ దూషించాడు. స్మిత్ నోరుపారేసుకున్నప్పటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇక డీఆర్‌ఎస్‌ విషయంలోనూ పలుమార్లు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇతర ఆసీస్ ఆటగాళ్లు కూడా కెప్టెన్ స్మిత్ బాటలోనే ఘర్షణ వైఖరి అవలంభించారు.

మరిన్ని వార్తలు