అండర్‌–25 చెస్‌ టోర్నీ విజేత శుభ్‌

25 May, 2017 10:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అండర్‌–25 హైదరాబాద్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో శుభ్‌ విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన ఆఖరి రౌండ్లో శుభ్‌ (4 పాయింట్లు) శ్రీనందన్‌ని ఓడించి టైటిల్‌ గెలవగా... శ్రీనందన్‌ 3 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు.

 

షణ్ముఖతేజ, ప్రణీత మ్యాచ్‌ ‘టై’ కాగా ఇద్దరూ చెరి 2.5 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మరో మ్యాచ్‌లో ప్రతీక్‌ (2 పాయింట్లు) సాయికృష్ణను ఓడించాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్‌ చెస్‌ అకాడమీ ఈ పోటీలను నిర్వహించింది.

మరిన్ని వార్తలు