జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం

16 Jul, 2017 01:07 IST|Sakshi
జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌కు స్వర్ణం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పసిడి బోణీ చేసింది. లండన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల ఎఫ్‌–46 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు.

సుందర్‌ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ రింకూ 55.12 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌–57 ఈవెంట్‌లో వీరేందర్‌ ధన్‌కర్‌ 13.62 మీటర్లతో నాలుగో స్థానాన్ని పొందాడు.  
 

మరిన్ని వార్తలు