సురేశ్‌ రైనాకు పుత్రోత్సాహం 

24 Mar, 2020 04:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అతని భార్య ప్రియాంక సోమవారం ఉదయం పండంటి బాబుకు జన్మనివ్వడంతో రైనా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పటికే ఈ జంట 2016లో పాప గ్రేసియా రైనాకు జన్మనివ్వగా... తాజాగా కుమారుడు వీరికి జతయ్యాడు. ఈ సందర్భంగా బాబుతో కలిసి ఉన్న ఉన్న ఫొటోను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న రైనా... అతన్ని ‘రియో రైనా’గా అభిమానులకు పరిచయం చేశాడు. ‘ఆశ, ఆశ్చర్యం, అవకాశంతో కూడిన కొత్త ప్రపంచానికి ఇది ఒక ఆరంభం. గ్రేసియా రైనా తమ్ముడు రియోను గర్వంగా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం’ అని రైనా ట్విట్టర్‌లో తెలిపాడు. 

>
మరిన్ని వార్తలు