‘ముస్తాక్’ విజేత యూపీ

21 Jan, 2016 00:57 IST|Sakshi

ముంబై: దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఉత్తరప్రదేశ్ గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో యూపీ 38 పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్రశాంత్ గుప్తా (49), సురేశ్ రైనా (37 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోయబ్ తాయి (26) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అంకిత్‌కు 3 వికెట్లు దక్కాయి.

>
మరిన్ని వార్తలు