సుశీల్‌ పసిడి ‘పట్టు’

18 Dec, 2017 05:39 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కామన్వెల్త్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్‌ ఖుల్లర్‌ (న్యూజిలాండ్‌)ను సుశీల్‌ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ 62 కేజీల విభాగం ఫైనల్లో 13–2తో తైలా తుహినే (న్యూజిలాండ్‌)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది.

మరిన్ని వార్తలు