41 ఫోర్లు, 2 సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ

9 Jan, 2020 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో మహారాష్ట్ర జట్టు దీటుగా రాణించింది. బ్యాట్స్‌మన్‌ స్వప్నిల్‌ ఫుల్‌పగర్‌ (474 బంతుల్లో 328; 41 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ట్రిపుల్‌ సెంచరీతో విజంభించడంతో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 294/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మహారాష్ట్ర జట్టు ఆట ముగిసే సమయానికి 172 ఓవర్లలో 7 వికెట్లకు 656 పరుగులతో నిలిచింది. దీంతో ఆతిథ్య జట్టుకు 3 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

స్వప్నిల్‌ ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కగా.. యశ్‌ క్షీర్‌సాగర్‌ (288 బంతుల్లో 142; 18 ఫోర్లు) సెంచ రీతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 326 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్‌ఆర్‌ నికమ్‌ (42; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఎస్‌డీ వార్ఘంతే (60; 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి 653 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ హైదరాబాద్‌ బౌలర్లు ప్రభావం చూపించలేకపోవడంతో ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయి కేవలం ఒకే పాయింట్‌కు పరిమితమైంది. మహారాష్ట్రకు 3 పాయింట్లు దక్కాయి.  ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈనెల 13 నుంచి సూరత్‌ వేదికగా జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది. 

మరిన్ని వార్తలు