పాకిస్తాన్‌దే టి20 సిరీస్

25 May, 2015 02:01 IST|Sakshi

లాహోర్ : పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగానే ముగిసింది. చివరి ఓవర్‌లో 12 పరుగులు కావాల్సి ఉండగా బిలావల్ భట్టి (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించాడు. దీంతో ఆదివారం గడ్డాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్  2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో మూడు వికెట్లకు 175 పరుగులు చేసింది.

షాన్ విలియమ్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్), సిబంద (46 బంతుల్లో 49; 2 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసి నెగ్గింది. ముక్తార్ అహ్మద్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా ఉమర్ అక్మల్ (21 బంతుల్లో 30; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు.

మరిన్ని వార్తలు